ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలు దేవస్థానాల్లో ఈవోల బదిలీ

తిరుమల తిరుపతి లడ్డూ తయారి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-09-19 14:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి లడ్డూ తయారి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ముఖ్యమైన దేవస్థానాల్లోని ఈవోలను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. అన్నవరం దేవస్థానం ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌‌ను బదిలీ చేసి.. తిరుపతి RJCగా ఆజాద్‌కి పోస్టింగ్‌ ఇచ్చింది. అలాగే జాయింట్‌ కమిషనర్‌ NVSN మూర్తిని ద్వారకా తిరుమల ఈవోగా నియామించింది. ప్రస్తుతం ద్వారకా తిరుమల ఈవోగా ఉన్న త్రినాథ్‌రావును సింహాచలం ఆలయ ఈవో గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Similar News