‘పవన్ ఒక తుఫాన్’..మరోసారి లోక్‌సభలో మారుమోగిన పవన్ కళ్యాణ్ పేరు!

లోక్‌సభ నూతన స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.సురేష్‌పై విజయం సాధించారు. మూజువాణి ఓటింగ్‌తో స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు.

Update: 2024-06-26 10:46 GMT

దిశ,వెబ్‌డెస్క్: లోక్‌సభ నూతన స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.సురేష్‌పై విజయం సాధించారు. మూజువాణి ఓటింగ్‌తో స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు. 18వ లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లాను ఎన్డీయే తన అభ్యర్థిగా ప్రకటించింది. లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ఓం బిర్లా గెలిచి చరిత్ర సృష్టించారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు వరుసగా రెండు సార్లు స్పీకర్‌గా ఎన్నికై ఘనత సాధించారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను జనసేన ఎంపీ బాలశౌరి అభినందిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘పవన్ ఒక తుఫాన్’ అని ప్రధాని మోడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో జనసేన తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నా అని తెలిపారు. స్పీకర్‌గా మీరు సభకు, దేశ ప్రజలకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మోడీ చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో తుఫాన్ అని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో దేశంలో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన అని చెప్పారు.

Tags:    

Similar News