విషాదం.. పిల్లలతో కలిసి బావితో దూకి తల్లి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్నారు..

Update: 2024-06-30 05:54 GMT

దిశ, వెబ్ డెస్క్: కుటుంబ కలహాలతో కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా సోమల మండలం పట్రపల్లికి చెందిన రాణి తన ఇద్దరు కూతుర్లు జోష్మిత, హిమశ్రీ కలిసి బావిలో దూకారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ కలహాలా.. మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన పట్రపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Similar News