MLC దువ్వాడ వీరంగం.. అర్ధరాత్రి భార్యా, కూతురిపై దాడికి యత్నం

వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ వీరంగం సృష్టించారు. తన భార్య, పిల్లలపై అర్ధరాత్రి దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళితే.. గత కొద్దిరోజులుగా దువ్వాడ శ్రీనివాస్ తమను వదిలేసి వేరే దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య వాణి, కూతురు హైందవి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-08-10 05:56 GMT

దిశ, ప్రతినిధి శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ వీరంగం సృష్టించారు. తన భార్య, పిల్లలపై అర్ధరాత్రి దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళితే.. గత కొద్దిరోజులుగా దువ్వాడ శ్రీనివాస్ తమను వదిలేసి వేరే దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య వాణి, కూతురు హైందవి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీనివాస్.. విచక్షణ కోల్పోయి భార్యా, పిల్లలను కర్రతో కొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోఅక్కడే ఉన్న పోలీసులు ఎమ్మెల్సీని అడ్డుకున్నారు. ‘‘నన్ను రోడ్డుకి ఈడుస్తావా?’ అంటూ అర్ధరాత్రి తన భార్య పిల్లలపై దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, దివ్వెల మాధురి అనే మహిళతో గత కొద్ది కాలంగా శ్రీనివాస్ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో భార్యా, పిల్లలు వెళ్లి చూడగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు, కుటుంబంపై ఎమ్మెల్సీ దాడికి ప్రయత్నించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News