తల్లి, చెల్లిని చూడని వ్యక్తి జగన్: మంత్రి అనగాని సెటైర్స్

వైసీపీ చీఫ్ జగన్‌పై గుర్ల పర్యటనపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ సెటైర్లు వేశారు...

Update: 2024-10-24 14:42 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్(YCP chief YS Jagan) విజయనగరం జిల్లా గుర్ల పర్యటనలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్(CM Chandrababu, Minister Lokesh)పై ఫైర్ అయ్యారు. డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. డయేరియా(Diarrhea)తో ప్రజలు మృతి చెందుతుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని విమర్శించారు. అలాగే తమ కుటుంబ ఆస్తుల వివాదంపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పర్యటనను డైవర్ట్ చేసేందుకే తన కుటుంబ సమస్యలపై విష ప్రచారం చేస్తున్నారని, రాజకీయం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ (minister Anagani Satyaprasad) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహిళల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తల్లి, చెల్లిని చూడని వ్యక్తి జగన్ అని, లోకేష్‌ని విమర్శించే స్థాయి లేదన్నారు. దిశా చట్టంపై జగన్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ గుర్ల పర్యటన అని మంత్రి అనగాని కొట్టి పారేశారు. 


Similar News