అక్కడ.. ఇక్కడ కాదు.. చంద్రబాబు గుడివాడలో కొడాలితో సెల్ఫీ దిగాలి: మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. మచిలీపట్నం పోర్టుకు చంద్రబాబు హడావుడిగా పూజ చేశారని.. అనుమతులు కూడా తీసుకోకుండానే

Update: 2023-05-07 11:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. మచిలీపట్నం పోర్టుకు చంద్రబాబు హడావుడిగా పూజ చేశారని.. అనుమతులు కూడా తీసుకోకుండానే ఆయన భూమి పూజ చేశారని మండిపడ్డారు. శంకుస్థాపనలు చేయడం తప్ప.. తిరిగి వాటిని పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఉండదని ఎద్దేవా చేశారు. ఫేక్ ఫౌండేషన్‌లకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని బాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎక్కడో సెల్ఫీలు దిగడం కాదని.. గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానితో టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగాలని సూచించారు. వైసీపీ హాయంలో ఏపీలో నాలుగు పోర్టులు నిర్మించామని ఈ సందర్భంగా మంత్రి రోజా తెలిపారు.

Tags:    

Similar News