నటి జెత్వానీ కేసు.. నేడు విజయవాడకు విద్యాసాగర్ తరలింపు

ముంబై నటి జెత్వానీ కేసులో వైసీపీ నేత విద్యాసాగర్‌ను నిన్న(శుక్రవారం) పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-09-21 05:44 GMT

దిశ,వెబ్‌డెస్క్:ముంబై నటి జెత్వానీ కేసులో వైసీపీ నేత విద్యాసాగర్‌ను నిన్న(శుక్రవారం) పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం పై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని విద్యాసాగర్‌తో పాటు పలువురు పోలీసు అధికారులపై ముంబై నటి జెత్వానీ విజయవాడలో ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌ను పోలీసులు డెహ్రాడూన్‌లో అరెస్ట్ చేశారు. ముంబై నటి జెత్వానీని వేధించిన కేసులో అరెస్టయిన కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు నేడు(శనివారం) విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న డెహ్రాడూన్‌లో అతడిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు, ముందుగా అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై ఇవాళ విజయవాడకు తీసుకురానున్నారు.


Similar News