‘ఉద్యోగాల సృష్టి.. మా అజెండా!’.. Minister Nara Lokesh

విజయవాడలో జరిగిన భారత పరిశ్రమల శాఖ సదరన్​ రీజినల్​ కౌన్సిల్​ సమావేశంలో మంత్రి లోకేష్​ పాల్గొన్నారు.

Update: 2024-09-21 07:39 GMT

దిశ, డైనమిక్​ బ్యూరో: విజయవాడలో జరిగిన భారత పరిశ్రమల శాఖ సదరన్​ రీజినల్​ కౌన్సిల్​ సమావేశంలో మంత్రి లోకేష్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు సృష్టించాలన్న ఒకే ఒక అజెండా తమది అని అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. కేవలం ఏపీ లోనే కాదు దేశంలో అందరి ముందున్న లక్ష్యం ఇదేనని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు కూడా నిత్యం ఇదే ఆలోచిస్తుంటారని తెలిపారు.

ఈజ్​ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​పై ఇప్పుడు ఏపీ దృష్టి పెట్టిందన్నారు. వేగంగా అనుమతులు, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. మానవ వనరుల నైపుణ్యం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఏఐ వంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని మరోసారి ఉద్ఘాటించారు. నెల రోజుల్లో ఎకనామిక్​ డెవలప్మెంట్​ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. పెట్టుబడుల కోసం మేమే మీ వద్దకు వస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.


Similar News