Hyper Aadi: పవన్ కళ్యాణ్‌కు విరాళం అందజేసిన జబర్దస్త్ కమెడియన్.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే?

జబర్దస్త్ షో(Jabardasth Show) ద్వారా చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు.

Update: 2024-09-21 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో(Jabardasth Show) ద్వారా చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది(Hyper Aadi) ఒకరు. తన కామెడి, పంచ్‌లతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే డబుల్ మీనింగ్ డైలాగ్స్ యూస్ చేస్తూ విమర్శలను సైతం ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా కురిసిన వర్షాలకు ఏపీలోని విజయవాడ(Vijayawada), తెలంగాణలోని ఖమ్మం(Khammam) జిల్లాలు వరదలతో నీటమునిగి అస్తవ్యస్తం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సహాయం చేశారు.

ఈ క్రమంలో హైపర్ ఆది కూడా ఏపీలోని వరద బాధితులకు విరాళంగా.. 3లక్షల రూపాయలకు సంబంధించిన చెక్‌ను స్వయంగా పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను కలిసి అందజేశారు. వీటిని వరదల కారణంగా నష్టపోయిన పంచాయితీలకు అందజేయాలని కోరారు. ఈ మూడు లక్షల్లో వరదల పీడిత గ్రామమైన ఎ.కె మల్లవరం(MK Mallavaram) (పిఠాపురం నియోజకవర్గం) లక్ష ఇవ్వాలని నిర్ణయించగా.. మిగతా రూ. 2లక్షలు తన స్వంత గ్రామ మైన పల్లాపల్లి గ్రామ పంచాయతీ (ప్రకాశం జిల్లా) కోసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రూ.6 కోట్లు విరాళం ఇచ్చి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపారు. ఆ స్ఫూర్తితో నేరుగా పంచాయితీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి తన వంతుగా రూ.3 లక్షలు ఇచ్చాను అని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News