‘త్వరలో ఏపీ వ్యాప్తంగా కూల్చివేతలు’.. మంత్రి నారాయణ సెన్సేషనల్ కామెంట్స్

రేపు (బుధవారం) స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) మచిలీపట్నం వస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

Update: 2024-10-01 14:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: రేపు (బుధవారం) స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) మచిలీపట్నంలో పర్యటిస్తారని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో నేషనల్ లా కాలేజ్(National Law College), డంపింగ్ యార్డ్(Dumping Yard), టీటీడీ(TTD) కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు విజయవాడలో అల్లకల్లోలం సృష్టించాయన్నారు.

ఈ నేపథ్యంలో వర్షపు నీటి(Rain Water) కాలువ ఆక్రమణలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. బుడమేరు(Budameru) ఆక్రమణల వల్ల విజయవాడకు(Vijayawada) భారీ వరద(Heavy Flood) వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆపరేషన్ బుడమేరు(Operation Budameru) మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు(Government places), చెరువులు(ponds), కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టి వారైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.


Similar News