Nara Lokesh: ‘ఆ బిగ్ అనౌన్స్‌మెంట్ ఏంటో రేపు చెప్తా’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మంత్రి డఆసక్తి రేపే ప్రకటన చేశారు. మంగళవారం టాటా సన్స్, టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు.

Update: 2024-10-08 14:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మంత్రి ఆసక్తి రేపే ప్రకటన చేశారు. మంగళవారం టాటా సన్స్, టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్టు చేశారు. నటరాజన్‌తో సమావేశం ఫలప్రదంగా సాగిందని తెలిపారు. రేపు భారీ ప్రకటన చేస్తానని అన్నారు. అప్పటివరకు అందరూ ఎదురుచూడాలని కోరారు. దీంతో నారా లోకేష్ ట్వీట్‌పై రాజకీయ విశ్లేషకులు చర్చోపచర్చలు చేస్తున్నారు. కాగా, యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అంతకుముందు మీడియాతో మాట్లాడిన లోకేష్ అన్నారు. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని నారా లోకేష్ వెల్లడించారు.


Similar News