సమీపిస్తున్న పండుగలు.. తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు సతీమణి కీలక పిలుపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భార్య నారా భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు.

Update: 2024-09-28 15:03 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భార్య నారా భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. త్వరలో దసరా, దీపావళి పండుగల వస్తున్న నేపథ్యంలో.. ఆమె చేనేత కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా తన అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో.. "రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొందాం. పండగల్లో వాటిని ధరించుదాం. నూలుపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేతలు కూడా.. మరింత ఆనందంగా పండుగ చేసుకొనేలా చేద్దాం." రాసుకొచ్చారు. దీంతో ఆమె ట్వీట్, పోస్టులను నెటిజన్లు షేర్ చేస్తూ.. మద్దతుగా నిలుస్తున్నారు.

Full View


Similar News