వద్దంటే 'మొండి'గా వెళ్ళాడు.! 'గల్లంతైయ్యాడు'.!!

Update: 2024-09-08 09:23 GMT

దిశ ప్రతినిధి,కృష్ణా జిల్లా:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వరదల వల్ల ఆస్తినష్టం, ప్రాణా నష్టం కూడా జరిగింది. అయితే ఉప్పులూరు బుడమేరు వాగులో కారుతో పాటు కొట్టుకుపోయిన పెడన వాసి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కలిదిండి ఫణికృష్ణ(44) పండుగకు గన్నవరం లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో శనివారం రాత్రి ఉప్పులూరు వద్ద కారుతో పాటు గల్లంతయ్యాడు. ‘బుడమేరు’ ప్రవాహం ఎక్కువగా ఉందని, ఉప్పులూరు మీదుగా వెళ్ళవద్దని బంధువులు చెప్పిన ఫణి వినలేదని చెబుతున్నారు. నీటి ప్రవాహం లో కారు చెట్టుకు చిక్కుకున్న.. ఫణి గల్లంతయ్యాడు. ఉదయం నుంచి 'ఎన్డీఆర్ఎఫ్' దళాలు గాలింపు చర్యలు చేపట్టారు.


Similar News