షర్మిలకు ఇప్పటికే జగన్ ఆస్తులు ఇచ్చారు: పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య చెలరేగిన వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు..

Update: 2024-10-24 13:15 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(YS Jagan), ఆయన సోదరి షర్మిల(Sharmila) మధ్య ఆస్తుల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్(Saraswati Power and Industries Private Limited) వాటాల పంపకం విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌(National Company Law Tribunal)లో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ(YS Vijayamma)తో పాటు పలువురికి ట్రిబ్యునల్‌ నోటీసులు జారీ చేసింది. ఆస్తుల వాటాలో సొంత చెల్లికి జగన్ అన్యాయం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని(Former Minister Perni Nani) స్పందించారు. షర్మిల ఆస్తుల వివాదంలో జగన్‌కు మద్దతు తెలిపారు. షర్మిలకు ఇప్పటికే జగన్ ఆస్తులు ఇచ్చినట్లు తెలిపారు. వ్యాపారాల్లో వచ్చే ఆదాయాల్లోనూ వాటాలు ఇస్తున్నారని తెలిపారు. జగన్ స్వార్జిత ఆస్తులను మాత్రమే అఫిడవిట్‌లో చూపించారని పేర్కొన్నారు. ఈ విషయంలో జగన్‌ను విమర్శించడం దుర్మార్గమని మండిపడ్డారు. అత్యంత నీచంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌పై దాడులు చేయించారని, ఆస్తులు అటాచ్ చేసి ఐదేళ్లు నరకం చూపారని గుర్తు చేస్తే ధ్వజమెత్తారు. 35 ఏళ్ల కుర్రాడిని తట్టుకోలేక చంద్రబాబు, సోనియా పిల్లిమొగ్గలు వేశారని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు.


Similar News