ఢిల్లీలో వైసీపీ నేతలు కారుకూతలు.. బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-08-04 11:11 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఢిల్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ధర్నా సందర్భంగా కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తప్పుబట్టారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో వైసీపీ నాయకులు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో వైసీపీ నాయకులు ఐదేళ్ల పాటు ఇచ్చిమొచ్చినట్లు దోచుకున్నారని ఆరోపించారు. అందుకే కూటమి ప్రభుత్వం తరపున శ్వేతపత్రాలు విడుదల చేశామని చెప్పారు. అవినీతిపై విచారణ చేపడతామని, నిందితులు కఠినంగా శిక్షిస్తామని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. 

Tags:    

Similar News