‘ఇక మొదలైంది’.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

జనసేన అధినేత, మంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం

Update: 2024-06-13 17:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, మంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరడంతో ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ ఇక మొదలైందని అన్నారు. నిరుద్యోగులకు మాట ఇచ్చినట్లుగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశాని చెప్పారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సైన్ చేశారని, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం పెట్టారన్నారు. ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం చేశారని పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ ఫైల్‌పై ఐదో సంతకం చేశారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

Read More...

ఆ రాతలు రాస్తే ఊరుకునేది లేదు.. నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్ 


Similar News