AP News:సీఎం చంద్రబాబుతో నలుగురు ఐఏఎస్‌ల కీలక భేటీ

తెలంగాణ నుంచి వచ్చిన నలుగురు ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబును కలిశారు.

Update: 2024-10-18 07:52 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ నుంచి వచ్చిన నలుగురు ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబును కలిశారు. నేడు(శుక్రవారం) ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఐఏఎస్‌లు రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణి ప్రసాద్.. సీఎంతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఐఏఎస్‌లతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ రోజు టీడీఎల్పీ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు ఏపీకి వెళ్లాలన్న ఆదేశాల నేపథ్యంలో ఎట్టకేలకు గురువారం రోజు ఏపీలో రిపోర్టు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలోనే కొనసాగేందుకుగాను డీవోపీటీ ఇచ్చిన ఆదేశాల పై వీరు క్యాట్‌ను హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ ఎక్కడా వారికి ఊరట లభించలేదు. దీంతో ఐదుగురు ఐఏఎస్‌లు నిన్న ఏపీలో రిపోర్ట్ చేశారు. వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి ఉదయమే రిపోర్ట్ చేయగా ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న మరో ఐఏఎస్ ఎం.ప్రశాంతి బుధవారం సాయంత్రం రిపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఏపీ సర్కార్ ఆ ఐదుగురు ఐఏఎస్ లకు పోస్టింగ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.


Similar News