‘చంద్రబాబు పాలన అవినీతి మయం’.. వైఎస్ ​జగన్ సంచలన వ్యాఖ్యలు​

చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Update: 2024-10-18 09:13 GMT

దిశ, డైనమిక్​బ్యూరో: చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్నచందంగా మారిందని మండిపడ్డారు. ఈ మేరకు తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజలు నిలదీస్తారని భయపడి.. కనీసం బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెడితే సూపర్-6 ఎక్కడ అని ప్రజలు అడుగుతారని భయం బాబును వెంటాడుతుందని అన్నారు.

వైఎస్సార్సీపీ హయాంలో మాదిరి.. బాబు ఐదు నెలల్లో డీబీటీ ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు. ఓటాన్ అకౌంట్‌లో ఇన్నాళ్లు నడిచే ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని దుయ్యబట్టారు. ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. ఇసుక తీసే కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులకే కట్టబెట్టారని అన్నారు. రెండు రోజులు మాత్రమే టెండర్​కు సమయం ఇచ్చారని తెలిపారు. అందరూ పండగ బిజీలో ఉంటే దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు.


Similar News