AP:రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు:మాజీ సీఎం జగన్

నేడు దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి.

Update: 2024-09-07 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు.. స‌క‌ల క‌ళ‌ల‌కు, విజ్ఞానానికి మూల స్వరూపుడు. అలాంటి వినాయ‌కుడిని ప్రతి ఒక్కరూ భ‌క్తి శ్రద్ధల‌తో పూజించాల‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’ అని జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి 17 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.


Similar News