ఆగని అత్యాచారాలు.. శవమై కనిపించి మరో బాలిక

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Update: 2024-07-16 05:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రీసెంట్‌గానే 8 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చేశారు. పార్కుల ఆడుకుంటోన్న చిన్నారిని తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి.. కాలువలో పడేశారు. నిందితులు ఇద్దరి వయస్సు 15 ఏళ్లు ఉండగా.. మరొకరి వయస్సు 12 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఘటన జరిగి వారం దగ్గరగా వస్తోన్న బాలిక మృతదేహం ఇంకా లభించలేదు. తొలుత చంపేసి కృష్ణానదిలో పడేశామని చెప్పిన దుండగులు తాజాగా పోలీసులు గట్టిగా అడగ్గా.. ఇప్పుడు పూడ్చిపెట్టామని చెబుతున్నారు. ఇలా.. 5 నెలల పాపను ఓ వృద్ధుడు, సొంత చెల్లిపై అన్న అత్యాచారం, 13 ఏళ్ల బాలికపై 63 ఏళ్ల వ్యక్తి.. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

తాజాగా కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని(13) అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో మంచం మీద శవమై కనిపించింది. బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో నాగరాజే హత్యాచారం చేసి పరారయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News