వరద బాధితులకు ఉచిత ప్రయాణం

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు అనేక ఇళ్ళు నీట మునిగి ప్రజలు సర్వస్వం కోల్పోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-09-06 15:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు అనేక ఇళ్ళు నీట మునిగి ప్రజలు సర్వస్వం కోల్పోయారని ఏపీ(AP) సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వరద సహాయక చర్యల్లో పర్యటించిన అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయవాడ(Vijayawada) నగరంలోని అనేక ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో మిగిలారాని.. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం అన్నారు. వరద ప్రాంతాల్లోని బాధితుల కోసం ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. శుక్రవారం ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రాంతాలను పరిశీలించామని, శనివారం వరదనష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధితులకు ఆహార పంపిణీ, మందులు, కొవ్వొత్తులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.  





Similar News