AP News:విశాఖలో ముగిసిన గవర్నర్ పర్యటన

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశాఖ జిల్లాలో రెండు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది.

Update: 2024-09-20 15:24 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశాఖ జిల్లాలో రెండు రోజుల పర్యటన ఈ రోజుతో (శుక్రవారం) ముగిసింది. ఏయూలో ఏర్పాటుచేసిన దివ్య కళా మేళా ప్రారంభోత్సవం కోసం గురువారం రాష్ట్ర గవర్నర్ జిల్లాకు విచ్చేసిన సంగతి విధితమే. పర్యటన ముగియడంతో విశాఖ విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం ఆయనకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చి, జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్, పోలీస్, ఎయిర్ పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News