అన్న క్యాంటీన్లకు రూ.కోటి విరాళం ఇచ్చిన మాజీ మంత్రి

ఏపీలో ఇటీవల ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-08-18 17:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఇటీవల ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.కోటి విరాళంగా ఇచ్చారు ఏపీ బీజేపీ మాజీ మంత్రి, ప్రముఖ విద్యాసంస్థల అధినేత గోకరాజు రంగరాజు. ఈ మేరకు ఆదివారం ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు. పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఏర్పాటైన అన్న క్యాంటీన్ల సంకల్పం తనకెంతో నచ్చిందని నారా లోకేష్ ను ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని, వాటికి తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని గోకరాజు రంగరాజు పేర్కొన్నారు.


Similar News