Ongole: నోటీసులపై స్పందించిన చెవిరెడ్డి
మాజీ మంత్రి, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు...
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar Reddy)కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలు(Ongole)లో యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్న ఆయనకు పోలీసులు 41-ఏ నోటీసులు అందజేశారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని సూచించారు. దీంతో ఈ నోటీసులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేసులు పెట్టి వైసీపీ నేతలను అణచివేయాలని టీడీపీ(Tdp) నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీడీపీ పాలించిన సమయంలోనూ తనపై 88 కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా 5 కేసులు నమోదు చేశారని చెప్పారు. ఉద్యమాలు, పోరాటాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) పుట్టిందని, కేసులకు భయపడమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, చేస్తూనే ఉంటామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు.