Former Minister Botsa: మాజీ మంత్రి బొత్సకు ఎదురుదెబ్బ.. జనసేనలో సోదరుడి చేరికకు ముహూర్తం ఫిక్స్

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YCP)కి ఘోర పరాభవం ఎదురైంది.

Update: 2024-09-26 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YCP)కి ఘోర పరాభవం ఎదురైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు మెజారీటీ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయిన వైసీపీ (YCP) నాయకుల్లో తమ భవిష్యత్తుపై బెంగ మొదలైంది. ఇదే పార్టీలో ఉంటే తాము వృద్ధిలోకి రాలేమని, కీలక పదవులు చేపట్టబోమని అభిప్రాయంతో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం పార్టీలు మారుతున్నారు. ఇక ఆయా జిల్లాల్లో పార్టీ కేడర్‌లో నిస్తేజం నిండుకుంది.

ఈ క్రమంలోనే వైసీపీలో కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు సొంత నియోజకవర్గంలోనే షాక్ తగనుంది. ఆయన సోదరుడు బొత్స లక్ష్మణరావు (Botsa Lakshmana Rao) త్వరలో జనసేనలో చేరబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వచ్చే నెల 3న జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఆ పార్టీ తీర్థం కప్పుకోనున్నారు. ఇందుకోసం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి (MLA Lokam Naga Madhavi)తో మంగళవారం రాత్రి లక్ష్మణరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గం (Nellimarla Constituency)లో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని లక్ష్మణ్ రావు పేర్కొన్నారు.   


Similar News