వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, వరదలకు ఏపీలోని విజయవాడ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.

Update: 2024-09-02 13:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, వరదలకు ఏపీలోని విజయవాడ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. వరదలో చిక్కుకున్న వారికి ఆహార పంపిణీకి అన్ని మార్గాలు వాడుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా విజయవాడ సింగ్ నగర్లోని వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు అధికారులు. పలు ప్రాంతాలను విభాగాలుగా అధికారులకు అప్పగించి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పూర్తిగా నీట మునిగిన రవినగర్, వాంబేకాలనీ, జక్కంపూడి కాలనీల్లో ఎంఐ-17, ఎఎల్-హెచ్ హెలికాప్టర్ల ద్వారా ఆహారపదార్థాలు, వాటర్ బాటిల్స్ జారవిడిచారు. కాగా విజయవాడ పొరుగు జిల్లాల ద్వారా మరిన్ని ఆహార పొట్లాలను తెప్పిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు.  


Similar News