సినీ నటి జత్వానీ కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం భారీ షాక్

సినీ నటి జత్వానీ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ అధికారులపై వేటు వేసింది.

Update: 2024-09-15 13:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటి జత్వానీ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ అధికారులపై వేటు వేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా, మరో ఐపీఎస్ అధికారి విశాల్‌ గున్నిని సస్పెండ్ చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించారని వీరిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీరితో పాటు ఆమెను విచారణ పేరుతో వేధించిన పలువురి పోలీసులపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం. సత్యనారాయణలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.


Similar News