AP News:చెరువులకు జలకళ.. గంగ పూజ చేసిన మాజీ మంత్రి

ఇటీవల భారీ వర్షాలకు పుట్టపర్తి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో చెరువులకు భారీగా నీరు చేరి కళకళలాడుతున్నాయి.

Update: 2024-10-24 12:39 GMT

దిశ ప్రతినిధి, పుట్టపర్తి: ఇటీవల భారీ వర్షాలకు పుట్టపర్తి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో చెరువులకు భారీగా నీరు చేరి కళకళలాడుతున్నాయి. గురువారం పుట్టపర్తి మున్సిపల్ పరిధిలో ఉన్న ఎనుములపల్లి చెరువు మరవ పారుతుండడంతో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అక్కడ గంగపూజ చేశారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లోని చెరువులకు భారీగా వర్షపు నీరు చేరి నీటితో చెరువులన్నీ కళకళలాడుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

భారీ వర్షాలు కురవడంతో సాగునీరు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మాజీ మంత్రి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాల్లో గ్రామాల అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమం కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం వరుణదేవుడు కరుణించడంతో రైతాంగంలో ఉత్సాహం నెలకొందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రితో పాటు స్థానిక టీడీపీ నాయకులు బీజేపీ, జనసేన తదితర నాయకులు పాల్గొన్నారు.


Similar News