Eluru: వైసీపీకి మరో ఊహించని షాక్.. టీడీపీ గూటికి మేయర్ దంపతులు

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న వైసీపీకి మరో ఊహించని షాక్ తగలబోతోంది.

Update: 2024-08-26 05:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న వైసీపీకి మరో ఊహించని షాక్ తగలబోతోంది. ఇన్నాళ్లు ఏలూరులో సంస్థాగతంగా బలంగా ఉన్న ఆ పార్టీ భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్‌, ఎస్‌ఎంఆర్ పెదబాబు దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ మేరకు రేపు వారు ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. వారి చేరికను సైతం ఎమ్మెల్యే బడేటి చంటి కూడా ఆమోదించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మేయర్ దంపతులతో పాటు 30 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు టీడీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఏలూరు న‌గ‌ర పాల‌క సంస్థ టీడీపీ వశం కానుంది. 


Similar News