నేడు తిరుమలకి డిప్యూటీ సీఎం.. నడకమార్గంలో స్వామివారి దర్శనం

ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

Update: 2024-10-01 04:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న జనసేన అధినేత మొదట రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకొని.. రాత్రికి తిరుమలకు ప్రయాణం అవుతారు. ఉదయాన్నే నడకమార్గంలో ప్రయాణించి శ్రీవారిని దర్శించుకుంటారు.

ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో నడకమార్గంలో 3-లేయర్ సెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. 200 మీటర్ల పరిధి వరకు రోప్‌ పార్టీలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్‌తో పాటు నడిచే ప్రయత్నం చేయవద్దని పార్టీ సూచించింది.


Similar News