తిరుమల మెట్ల మార్గంలో మృతదేహం

తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే మార్గంలోని నరసింహ స్వామి వారి ఆలయం సమీపంలో ఓ మృతదేహం పడిఉండటం స్థానికంగా కలకలం రేపింది

Update: 2024-10-06 05:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే మార్గంలోని నరసింహ స్వామి వారి ఆలయం సమీపంలో ఓ మృతదేహం పడిఉండటం స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజులుగా దుర్వాసన వస్తుండటంతో అక్కడి వ్యాపారులు అధికారులకు తెలిపారు. తొలుత కూంబింగ్స్ టీమ్ పోలీసులు కూడా మృతదేహాన్ని గుర్తించారు. వారి నుంచి సమచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా ఓ మృతదేహం కనిపించింది. మృతదేహం బాగా కుల్లిన స్థితిలో ఉంది. అక్కడే ఓ జింక కళేబరం కూడా కనిపించింది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి ఎవరు..అతను అక్కడికి ఎప్పుడు వెళ్ళాడు.. ఎలా చనిపోయాడన్న విషయమై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా..హత్యకు గురయ్యడా లేక అనారోగ్యంతో చనిపోయాడా..జంతువులు ఎవైనా దాడి చేశాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.


Similar News