Alluri District: విద్యుత్ షాక్‌తో సీఆర్పీఎఫ్ ఏఎస్సై మృతి

అల్లూరి జిల్లాలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై మృతి చెందారు...

Update: 2024-10-07 05:13 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లాలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై మృతి చెందారు. మెట్టగూడెంలో ఏఎస్సై తిరునావక్ అరసు‌ తన బృందంలో కలిసి కూంబింగ్ వెళ్లారు.  అయితే ఆయనకు విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో తిరునావక్ అరసు‌ అక్కడికక్కడే మృతి చెందారు. జంతువుల కోసం అటవీ ప్రాంతంలో వేటగాళ్లు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి సమయం కావడంతో చీకట్లో విద్యుత్ వైర్లు కనిపించలేదు. కూంబింగ్ చేస్తున్న సమయంలో కాళ్లకు వైర్లు తగలడంతో తమిళనాడు చెందిన ఏఎస్సై తిరునావక్ అరసు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు.. ఏఎస్సై మృతదేహాన్ని పోస్టుమారంకు తరలించారు. జంతువుల వేట కోసం విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News