18 మంది ప్రజాప్రతినిధులకు కోర్టు సమన్లు

కోర్టు 18 మంది ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేసింది.

Update: 2023-02-23 02:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోర్టు 18 మంది ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. అనంతపురం అక్రమ వాహనాల కేసులో టీడీపీ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు 18 మందికి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది.

మార్చి 1న విచారణకు హాజరు కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే వాహనాల కేసులో ప్రభాకర్ రెడ్డి గతంలో ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అయితే బీఎస్ 3 వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించగా ఆ వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా చూపించి రిజిస్ట్రేషన్ చేసినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. 

Tags:    

Similar News