AP News:బాలీవుడ్ నటి పై కేసు..సీఎంవో ఆరా

బాలీవుడ్ నటిపై కేసు పెట్టిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

Update: 2024-08-28 05:37 GMT

దిశ,వెబ్‌డెస్క్:బాలీవుడ్ నటిపై కేసు పెట్టిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బాలీవుడ్ నటిపై అత్యాచారం కేసును రాష్ట్ర IPSలు సెటిల్ చేశారన్న వ్యవహారంపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఈ కేసులో వీరి ప్రమేయం ఎంత మేరకు ఉందనే విషయం పై సీఎంఓ ఆరా తీస్తోంది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల పాత్ర ఏ మేరకు ఉందన్న వ్యవహారంపై వివరాలు కోరింది. ఈ క్రమంలో కేసు వివరాలను పోలీసు శాఖ నుంచి సీఎంవో కార్యాలయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి విజయవాడ CP, DCPలకు 2 రోజుల్లో షోకాజ్ నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ముంబైలో ఓ వ్యాపారవేత్త కుమారుడిపై నటి అత్యాచారం కేసు పెట్టగా, విజయవాడలో ఆమె పై మరో కేసు పెట్టి అరెస్ట్ చేసి ముంబై కేసును సెటిల్ చేసినట్లు సమాచారం.


Similar News