ప్రతి ఇంటికి బెంజ్ కారు, కిలో బంగారం.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

భీమిలీ నియోజకవర్గ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు రాగానే కొత్త మోసాలతో అటు చంద్రబాబు, ఇటు దత్తపుత్రుడు సిద్ధమయ్యారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Update: 2024-01-27 12:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: భీమిలీ నియోజకవర్గ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు రాగానే కొత్త మోసాలతో అటు చంద్రబాబు, ఇటు దత్తపుత్రుడు సిద్ధమయ్యారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వడానికి రెడీ అయ్యారని మండిపడ్డారు. మరోసారి ప్రతి ఇంటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని చెప్పడానికి వెనుకాడరు అని చెప్పారు. భీమిలిలో అటు సముద్రం.. ఇటు వైసీపీ జన సముద్రం ఉందని అన్నారు. తాను అభిమన్యుడని కాదని.. అర్జునుడనని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెన్నుపోట్లు, ఎత్తులు, జిత్తులకు సిద్ధమయ్యారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాను దత్తపుత్రులను నమ్ముకోలేదని.. దేవుడు, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందిన మహిళలే తమకు స్టార్ క్యాంపెయినర్లు అని అన్నారు. రాష్ట్ర మహిళలంతా మరోసారి వైసీపీ తరపున ప్రచారానికి సిద్ధమవ్వాలని కోరారు. ఇవి ఎంపీ ఎన్నికలు కావని.. ఎమ్మెల్యేలను కొనే ఎన్నికలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ వరకు పేదల భవిష్యత్‌ను తీర్చిదిద్దే ఎన్నికలు అని అభిప్రాయపడ్డారు. చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐదేళ్లలో మార్పు తీసుకొచ్చానని జగన్ చెప్పారు. విశ్వసనీయతకు అర్ధం చెప్పానని అన్నారు. చేసేదే చెబుతానని.. చెప్పిందే చేస్తానని వెల్లడించారు.

Tags:    

Similar News