బద్వేల్ ఘటన.. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు
కడప జిల్లా బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో ఫోన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ఫోన్లో మాట్లాడారు.
దిశ, డైనమిక్బ్యూరో:కడప జిల్లా బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో ఫోన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ఫోన్లో మాట్లాడారు. ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన లో ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఆ యువతి కుటుంబంతో సీఎం ఫోన్లో మాట్లాడి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం తో పాటు.. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.