రాష్ట్రంలో వరుస ఘటనలు.. వారికి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయి.

Update: 2024-07-15 12:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయి.మరీ దారుణంగా మూడో తరగతి విద్యార్థినిపై ఆరో తరగతి విద్యార్థులు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన మొత్తం రాష్ట్రాని కదలించింది. ఈ కేసులో ఇప్పటి వరకు బాలిక మృతదేహం లభ్యం కాలేదు. ఇలాంటి వరుస సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో అధికాలతో సీఎం మాట్లాడుతూ.. 9 సంవత్సరాల బాలికపై మైనర్లు అత్యాచారం చేసి హత్య చేయడమేంటని.. 6 నెలల పసికందుపై లైంగిక దాడి చేయడమేంటని, ఈ సమాజం ఎటుపోంతుందని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి మత్తు కరాణంగానే ఇలాంటి నేరాలు జరగుతున్నాయని.. మత్తు కారణంగా కొందరు ఉన్మాదులుగా మారుతున్నారని.. గంజాయి మత్తులో నేరాలు చేసే వారిని తమ ప్రభుత్వం వదిలి పెట్టదని.. సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Tags:    

Similar News