రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్.. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం కీలక ప్రకటన

రాయలసీమ వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు...

Update: 2024-09-23 11:09 GMT

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ వాసుల(Rayalaseema People)కు సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) గుడ్ న్యూస్ తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌పై ఆయన కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో జరిగిన న్యాయశాఖ సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. రాయలసీమలో హైకోర్టు బెంచ్(High Court Bench) ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో100 ఎకరాల్లో ఇంటర్ నేషనల్ లా స్కూలు ఏర్పాటు చేస్తామన్నారు. జూనియర్ న్యాయవాదులకు రూ. 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని స్పష్టం చేశారు. నిందితులకు శిక్షపడేలా విచారణ ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.


మరోవైపు ముస్లిం మైనారిటీలకు గత తెలుగుదేశం ప్రభుత్వం(Telugu Desam Government)లో ఇచ్చిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు బేరీజు వేసుకుని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.


Similar News