ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. కారణం ఏంటంటే?

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లడం జరిగింది.

Update: 2024-09-20 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో మద్దిరాలపాడు గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి ఆంజనేయ స్వామి ఆలయాన్ని(Hanuman Temple) సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం సీఎం చంద్రబాబుకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అయితే నేడు(శుక్రవారం) సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో(Srikakulam District) పర్యటించాల్సి ఉంది.. కానీ ఈ పర్యటన రద్దు అయింది. శ్రీకాకుళం జిల్లా పర్యటన స్థానంలో ప్రకాశం జిల్లా(Prakasam District) పర్యటన ఖరారైంది. చంద్రబాబు నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొంటారు. మద్దిరాలపాడు గ్రామంలో చంద్రబాబు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలవనున్నట్లు సమాచారం. అనంతరం సీఎం గ్రామ సభకు హాజరవుతారు.


Similar News