Breaking: ఫార్మా కంపెనీ బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అచ్చుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించారు...

Update: 2024-08-22 07:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అచ్చుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయాపడిన కొందరు కార్మికలకు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఎవరికి ఏం కాదని, ధైర్యంగా ఉండాలని బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. వారికి అందిస్తున్న వైద్య చికిత్సపైనా ఆరా తీశారు. బాధితులు పూర్తిగా రికవరీ అయ్యే వరకూ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. తమ వారికి ఎలాంటి ప్రమాదం జరగదని, త్వరలోనే కోలుకుంటారని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు  చంద్రబాబు హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News