CM Chandrababu:పవన్‌ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు.. కారణం ఇదే!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.

Update: 2024-10-15 10:05 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాల’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. సోమవారం నుంచి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభమైయ్యాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పల్లె పండుగ కార్యక్రమాల పై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్దేశించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోంది అని సీఎం చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలోని 13,326 గ్రామాలలో మొత్తం 30 వేల పనులు చేపట్టాలనే బృహత్ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రూ.4,500 కోట్లు ఖర్చుతో చేస్తున్న అభివృద్ధి పనులు గ్రామాల్లో ఉపాధి కల్పిస్తూ పల్లెల్లో మళ్లీ వెలుగులు తెస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పల్లెల్లో సంతోషాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News