Tirumala News:తిరుమలలో భక్తులకు తిలక ధారణ ప్రారంభించిన టీటీడీ ఈవో

తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో జె.శ్యామల రావు శుక్రవారం ప్రారంభించారు.

Update: 2024-09-06 13:47 GMT

దిశ,తిరుమల: తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో జె.శ్యామల రావు శుక్రవారం ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు, భక్తులకు శ్రీవారి సేవకులు తిలక ధారణ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ..తిరుమలలో భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి సేవకులు తిరుమలలోని ఏటీసీ, సుపథం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, విక్యూసి 1 మరియు 2ల వద్ద నిరంతరాయంగా తిలక ధారణ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, పిఆర్ఓ (ఎఫ్ ఏసి) కుమారి పి.నీలిమ, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.


Similar News