Breaking: ఇన్నోవా టైర్ పేలి ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

చిత్తూరు జిల్లాలో తెల్లారేసరికే రోడ్డు రక్తమోడింది.....

Update: 2024-09-14 02:56 GMT

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో (Chittoor District) తెల్లారేసరికే రోడ్డు రక్తమోడింది. ఘోర ప్రమాదం ఇద్దరు బెంగళూరు వాసుల (Bengaluru) ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఐదుగురిని గాయాలపాలు చేసింది. ఈ ఘటన బెంగళూరు-చిత్తూరు హైవేలోని (Bengaluru-Chittoor Highway) మొగిలి వద్ద జరిగింది. ఏడుగురు వ్యక్తులు ఇన్నోవా(Innova Vehicle)లో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారి టైరు పేలడంతో వాహనం అదుపు తప్పింది. బలంగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


Similar News