AP News:వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

విజయవాడ వరద బాధితులకు పది కేజీలు పట్టే 120 బ్యాగ్‌ల రైస్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు అందజేశారు.

Update: 2024-09-14 14:42 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి: విజయవాడ వరద బాధితులకు పది కేజీలు పట్టే 120 బ్యాగ్‌ల రైస్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు అందజేశారు. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాస ఆవరణలో బియ్యాన్ని జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నాయకులు అలహరి సుధాకర్, తోకల అశోక్‌లు అందించారు. వీటితో పాటు గత వారం రోజులుగా నగరంలో నిత్యావసరాలను జనసేన పార్టీ యువ నాయకులు ఆరణి మదన్ నేతృత్వంలో సేకరిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సుమారు యాభై లక్షల విలువ చేసే నిత్యావసరాలను ప్రత్యెక కిట్‌ను ఏర్పాటు చేసి వాటిని నేరుగా వరద బాధితులకు అప్పగించనున్నట్లు ఆయన చెప్పారు. జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిత్యావసరాలు వరద బాధితులకు అందించనున్నట్లు ఆయన చెప్పారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.


Similar News