Tirupati అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల తోపులాట

తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది. వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు....

Update: 2022-12-31 16:17 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది. వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేకపోవంతో భక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో భూదేవి కాంప్లెక్స్ వద్దకు జేఈవో, ఎస్పీ చేరుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించి పరిస్థితిని అదుపు చేశారు. ఆదివారం నూతన సంవత్సర, ముక్కోటి ఏకాదశి కావడంతో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు టీటీడీ  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అయితే అలిపిరి భూమదేవి కాంప్లెక్స్ వద్దకు భక్తులు ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది. 


Similar News