తిరుమల లడ్డూ వివాదం.. సినీ నటుడు మోహన్ బాబు సంచలన ట్వీట్

తిరుమల లడ్డూ వివాదంపై సినీ నటుడు మంచు మోహన్ బాబు సంచలన ట్వీట్ చేశారు...

Update: 2024-09-21 12:56 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం (Tirumal Laddu Issue)పై సినీ నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) సంచలన ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును కలుపుతున్నారని తెలియగానే తాను తల్లడిల్లిపోయానని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) దగ్గర ఇలా జరగడం ఘోరమని మండిపడ్డారు. కల్తీ ఘటన నిజమైతే నేరస్తులను శిక్షించాలని సీఎం చంద్రబాబు (Cm Chandrababu)ను కోరుకుంటున్నానని ‘ఎక్స్’లో మోహన్ బాబు ట్వీట్ చేశారు.

‘‘నిత్యం మా యూనివర్సిటీ నుంచి తిరుమల క్షేత్రాన్ని (Tirumala Temple) చూస్తాం. నాతో పాటు వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. ఒక భక్తుడిగా దిగ్భ్రాంతికి గురయ్యా.’’ అని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.




Similar News