Tirumala Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీ(AP) సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) గత ప్రభుత్వం వైసీపీ(YCP)పై సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-09-18 14:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) గత ప్రభుత్వం వైసీపీ(YCP)పై సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నప్రసాదంలో నాసిరకం భోజనం పెట్టరాని, దేవస్థానం పరువు దిగజార్చడానికి కుట్ర పన్నారని అన్నారు. దేవుని దగ్గర పెట్టే అన్ని ప్రసాదాల్లో కల్తీ చేశారని జగన్ (Jagan) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖపు నిర్ణయాలు తీసుకొని శ్రీవెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక టీటీడీలో అన్నిటిని మార్చివేసామని, ఇపుడు అన్ని ప్రసాదాల్లో నాణ్యమైన సరుకులు వాడుతున్నామని, నిత్యాన్నదానాల్లో భక్తులకు మంచి భోజనం అందిస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు.   

Tags:    

Similar News