బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ టీడీపీ ఆచితూచి ఆడుగులేస్తోంది.

Update: 2024-01-07 10:20 GMT

దిశ వెబ్ డెస్క్: ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ టీడీపీ ఆచితూచి ఆడుగులేస్తోంది. ప్రజలను ఆకర్షించే పథకాలను తీసుకొస్తోంది. తెలుగుదేశం అధినేత అలుపున్నది లేకుండా అహర్నిశలు ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో  ‘రా.. కదలి రా’ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీ అని పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక వంద పథకాలను రద్దు చేశారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

జగన్ పరిపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారన్న ఆయన తాను అధికారం లోకి రాగానే బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట సూపర్‌ సిక్స్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం అధికారం లోకి రాగానే నిరుద్యోగాన్ని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామని.. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. అలానే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఇంకా మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని పేర్కొన్నారు. అలానే టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపిన ఆయన.. దొంగ ఓట్లతో గెలవాలనుకునే వైసీపీ నేతల ఆటలు ఇక సాగవని పేర్కొన్నారు  

Tags:    

Similar News