పోరాటం అనేది లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లే.. చంద్రబాబు

ఈ రోజు స్వాతంత్ర సమరయోధులు భరతమాత ముద్దు బిడ్డ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి.

Update: 2024-01-23 05:20 GMT

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు స్వాతంత్ర సమరయోధులు భరతమాత ముద్దు బిడ్డ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరవీరులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ప్రసంగించిన నారా చంద్రబాబు నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోరాటం అనేది లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లే అని నేతాజీ అన్నారని పేర్కొన్నారు.

కనుక మహానుభావుడైన ఆ నేతాజీ మాటలనే స్ఫూర్తిదాయకంగా తీసుకుని నేడు ప్రజలను పీడిస్తున్న అరాచక శక్తులపై పోరాడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక నేతాజీ జయంతిని దేశం శౌర్యదినోత్సవంగా జరుపుకుంటుందని .. అలాంటి మోహోన్నతమైన ఈ రోజు ఆ దేశభక్తుని సేవలు స్మరించుకుందామని పేర్కొంటూ ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.   

Tags:    

Similar News