జగన్‌కు బిగ్ రిలీఫ్.. యూకే టూర్‌కు గ్రీన్ సిగ్నల్

అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం వై.ఎస్.జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది..

Update: 2024-08-27 15:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం వై.ఎస్.జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు ఆయన కోర్టు అనుమతి కోరారు. యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నెంబరు, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్‌కు ఐదేళ్ల కాలపరిమితితో కొత్త పాస్ పోర్ట్ జారీకి కూడా సీబీఐ కోర్టు నుంచి అనుమతి లభించింది.

Tags:    

Similar News